: గవర్నర్ వద్దకు చంద్రబాబు... మంత్రివర్గ విస్తరణపై చర్చ!

మరికాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గవర్నర్ నరసింహన్ ను ప్రత్యేకంగా కలవనున్నారు. అసెంబ్లీ సమావేశాలు, వినాయకచవితి పర్వదినం నేపథ్యంలో గత వారం రోజులుగా హైదరాబాద్ లోనే ఉన్న చంద్రబాబు నేడు విజయవాడకు బయలుదేరే ముందు గవర్నర్ ను కలవాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ, అసెంబ్లీ కొనసాగిన తీరు, వైకాపా శాసనసభ్యుల ఉన్మాదపు చర్యలు తదితరాల గురించి వివరించనున్నట్టు తెలుస్తోంది. ఇక మంత్రివర్గ విస్తరణపై కూడా వీరిద్దరి మధ్యా చర్చ జరుగుతుందని సమాచారం. ఉదయం 9:30 గంటలకు నరసింహన్ వద్దకు చంద్రబాబు వెళ్లనున్నారు.

More Telugu News