: మాట్లాడే అవకాశమే లేని సభాపతిని 'స్పీకర్' అని ఎందుకంటారో?: మధుసూదనాచారి డౌట్!

వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి ఓ సందేహం వచ్చింది. వెంటనే దాన్ని బయటకు చెప్పి, దాని వెనకున్న విషయాన్ని బయటకు తీసి చెప్పాలని పాత్రికేయులకు సూచించారు. ఇంతకీ ఆయనకు వచ్చిన డౌట్ ఏంటో తెలుసా? అసెంబ్లీలో సభ్యులంతా మాట్లాడతారు, తమ సమస్యలను ఏకరవు పెడతారు. నియోజకవర్గంపై ప్రశ్నలేస్తారు. ఈ అవకాశమే లేని స్థానం సభాపతిది. సభను నియంత్రణలో ఉంచడం, సభకు సంబంధించిన విషయాలు మినహా, మరేమీ మాట్లాడటమన్నది ఉండదు. అలాంటి పదవికి 'స్పీకర్' అని పేరెందుకు పెట్టారు?... స్పీకర్ అని సభాపతిని ఎందుకు అంటారో తెలియదని, దీన్ని కనుక్కోవాలని ఆయన కోరారు.

More Telugu News