: కదిలాయ్ కదిలాయ్...జగన్నాథ్ రథ చక్రాలు కదిలాయ్...!

జగన్నాథ రథచక్రాలు కదిలాయి. ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పూరీలో జగన్నాథ యాత్ర అంగరంగ వైభవంగా జరుగుతోంది. వేలాదిగా తరలి వచ్చిన భక్తజనం జగన్నాథుడు కొలువైన రథాన్ని లాగేందుకు ఉత్సాహం చూపించారు. ఈ సందర్భంగా భక్తులు అత్యంత భక్తి ప్రపత్తులతో జగన్నాథుడికి పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా అంగరంగవైభవంగా జరిగే జగన్నాథ రధయాత్రను నిర్వహించేందుకు ఒడిశా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంది. రథయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఆలయాధికారులు చర్యలు తీసుకున్నారు.

More Telugu News