: ఏపీ సీఎం అనవసర రాద్ధాంతం చేస్తున్నారు: ఎర్రబెల్లి దయాకర్ రావు

నీటి విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని టీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. తెలంగాణ నీటి వాటాను అడ్డుకునే యత్నాలు చేయవద్దని ఆయన కోరారు. తెలంగాణను అభివృద్ధి చేసేందుకు, సమస్యలను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ ఒక ప్రణాళికతో ముందుకెళ్తున్నారన్నారు. తెలంగాణలో విద్యుత్ సమస్య లేకుండా చేశారని, ఆయన చేస్తున్న మంచి కార్యక్రమాలకు మద్దతు తెలపాలనే తాను టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చానని ఇటీవలే పార్టీ మారిన ఎర్రబెల్లి అన్నారు.

More Telugu News