: పెద్దల సభకు నామినేట్ అయిన ప్రముఖులు వీరే!
పార్లమెంటులో పెద్దల సభగా పరిగణిస్తున్న రాజ్యసభకు ఆరుగురు ప్రముఖులను నామినేట్ చేస్తూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు నిన్న కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఆరుగురిలో మలయాళ నటుడు సురేష్ గోపీ ఉన్నట్లు నిన్ననే వార్తలు వెలువడ్డాయి. ఇక మిగిలిన ఐదుగురి విషయానికొస్తే... కాంగ్రెస్ పార్టీపై రాజీలేని పోరు సాగిస్తున్న బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి, ప్రముఖ పాత్రికేయుడు స్వపన్ దాస్ గుప్తా, బాక్సింగ్ క్రీడాకారిణి మేరీకాం, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ, ప్రముఖ ఆర్థిక వేత్త నరేంద్ర జాదవ్ ఉన్నారు.