: జగన్ ఎంతో గౌరవించారు, కానీ..: దేశంలో చేరికపై స్పందించిన సుజయకృష్ణ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ తననెంతో గౌరవించారని, అయితే, వెనుకబడిన నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారాలని నిర్ణయించుకున్నానని బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు వెల్లడించారు. ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, కార్యకర్తలతో చర్చించిన తరువాతనే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. వ్యక్తుల మధ్య భేదాభిప్రాయాలు ఉండటం సహజమేనన్న ఆయన, బొత్స సత్యనారాయణ వైకాపాలో చేరినందుకు నిరసనగానే, తాను టీడీపీలోకి వెళుతున్నట్టు వచ్చిన వార్తలను ఖండించారు. కాగా, నేడు చంద్రబాబు సమక్షంలో సుజయకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారన్న సంగతి తెలిసిందే.

More Telugu News