: భారత యుద్ధనౌక ఐఎన్ఎస్ నిరీక్షక్ పై పేలుడు

కేరళలోని విళింజమ్ తీరానికి 40 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న భారత యుద్ధనౌక ఐఎన్ఎస్ నిరీక్షక్ పై పేలుడు సంభవించిన ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గస్తీ నౌకలకు సహాయకారిగా విధులందించే ఈ నౌక తీరానికి వస్తుండగా, ఆక్సిజన్ సిలిండర్ పేలినట్టు తెలుస్తోంది. గత రాత్రి జరిగిన ఈ ఘటనలో నౌక డ్రైవర్ కాలును కోల్పోగా, మరో ఇద్దరు నావికా దళ సిబ్బందికి గాయాలయ్యాయి. డ్రైవర్ కాలులో మోకాలి పైభాగం వరకూ తీసేయాల్సి వచ్చిందని, ఎవరికీ ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు. జరిగిన ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్టు ఉన్నతాధికారులు వివరించారు.

More Telugu News