: మూడు నెలల్లో 8.5 లక్షల కుంటలు: అధికారులకు చంద్రబాబు ఆదేశం

వచ్చే మూడు నెలల వ్యవధిలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో 8.5 లక్షల నీటి కుంటలను తవ్వి వర్షపు నీటిని ఒడిసి పట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. ఈ మధ్యాహ్నం జల వనరులు, భూగర్భ జలాలు, వైద్యశాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, సాధ్యమైనంత త్వరలో కుంటల తవ్వకం పనులు పూర్తి కావాలని ఆదేశించారు. ఈ వేసవిలో నీటికి కొరత రాకుండా చూడాలని, రానున్న రోజుల్లో వేడి తీవ్రత పెరగనున్నందున వడదెబ్బ కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అంతకన్నా ముందు ప్రజల్లోకి వెళ్లే అధికారులు తగు జాగ్రత్తలతో ఉండాలని సలహా ఇచ్చారు.

More Telugu News