: ఏపీ బడ్జెట్ ముఖ్యాంశాలు-2
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ముందుకు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ ప్రతిపాదనలను తీసుకువచ్చారు. 2016-17 ఏపీ బడ్జెట్ లోని మరిన్ని ముఖ్యాంశాలు...
* ఏపీలో వ్యాపారం మరింత సులభం.
* అన్ని రంగాల అభివృద్ధికీ పెద్దపీట.
* తిరుపతిలో సైబర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్. ఇజ్రాయిల్ సహకారంతో ఏర్పాటు.
* ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కు తొలి పాలసీని ప్రకటించనున్న ఏపీ.
* రాష్ట్రంలో సహజవనరులు పుష్కలం.
* సుదీర్ఘమైన సముద్రతీరం ఏపీకి అదృష్టదాయని.
* ఎకానమీ పెరిగేలా నూతన ఉద్యోగ సృష్టి.
* విజయవాడలో కోస్టల్ మ్యూజియం ఏర్పాటు.
* తిరుపతి, విశాఖ, విజయవాడల్లో 3 కన్వెన్షన్ సెంటర్లు.
* పీపీపీ విధానంలో కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం.
* 2015లో పెరిగిన పర్యాటకుల సంఖ్య
* 2014తో పోలిస్తే 30 శాతం పెరిగి 12.18 కోట్లకు చేరిన పర్యాటకులు
* ఈ ఏడు 40 శాతం పెరుగుతారని అంచనా.
* కోస్తా ప్రాంతంలో ఎకనామిక్ జోన్లు.
* కేంద్ర సాయంతో మరిన్ని ఎస్ఈజడ్ లు.
* విశాఖ - చెన్నై, కర్నూలు - బెంగళూరుల మధ్య ఇండస్ట్రియల్ కారిడార్ల అభివృద్ధి.
* ఈ నగరాల మధ్య రైలు రవాణాకు పెద్దపీట.
* దొనకొండలో 5,717 ఎకరాల్లో పారిశ్రామిక వాడ.
* అంచనా వ్యయం రూ. 23,000 కోట్లు.
* 1.33 లక్షల మందికి ఉద్యోగాల కల్పన లక్ష్యం.
* పలు ప్రాజెక్టులకు ఏడీబీ, జపాన్ బ్యాంకుల సాయం.
* 2016-17లో మరిన్ని కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు.
* ప్రకాశం జిల్లాలో నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ మేన్యుఫాక్చరింగ్ జోన్.
* 14,231 ఎకరాల్లో జోన్.
* రూ. 43,700 కోట్ల పెట్టుబడులు రానున్నాయి.
* వచ్చే పదేళ్లలో 5 లక్షల మందికి ఉద్యోగావకాశాలు.
* చిత్తూరు జిల్లాలో సైతం 5 వేల హెక్టార్లలో ఇదే తరహా జోన్.
* రూ. 30 వేల కోట్ల పెట్టుబడి, 3 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యం.
* రాష్ట్రంలోని నౌకాశ్రయాల కెపాసిటీ పెంపునకు చర్యలు.
* మచిలీపట్నం, భావనపాడు పోర్టుల్లో పీపీపీ విధానంలో అభివృద్ధి.
* కాకినాడ, కృష్ణపట్నం, విశాఖపట్నం ప్రాంతాల్లో కొత్తగా మల్టీ మోడల్ లాజిస్టిక్ పోర్టులు.
* సాగరమాల ప్రాజెక్టుల్లో భాగంగా వీటి అభివృద్ధి.
* 2015తో పోలిస్తే, 59 శాతం పెరిగిన ఎయిర్ ట్రాఫిక్.
* అతి త్వరలోనే విజయవాడ, రాజమహేంద్రవరం విమానాశ్రయాల విస్తరణ.
* భోగాపురం, దగదర్తి, ఓర్వకల్లు, నాగార్జున సాగర్, దొనకొండల్లో చిన్న విమానాశ్రయాలు.
* రాష్ట్రవ్యాప్తంగా రోడ్ గ్రిడ్.
* అన్ని గ్రామాల నుంచి మండల కేంద్రాలకు రహదార్లు.
* అక్కడి నుంచి జిల్లా కేంద్రాలకు రెండు వరుసల రోడ్లు.
* అన్ని జిల్లా కేంద్రాల నుంచి రాజధానికి నాలుగు లేదా ఆరు వరుసల రహదార్లు.
* పర్యాటక ప్రాంతాలు, ఇండస్ట్రియల్ హబ్ ల నుంచి సమీప జాతీయ రహదారికి రెండు లేదా నాలుగు లైన్ల రోడ్లు.
* అనంతపురం - కర్నూలు - అమరావతికి రహదారికి ఇప్పటికే జాతీయ హోదా.
* దీంతో రాయలసీమకు రాజధానితో మెరుగైన కనెక్టివిటీ.
* 2015-16లో 2704 కి.మీ రహదారుల నిర్మాణం.
* ప్రధాన మంత్రి గ్రామ స్వరాజ్ యోజనలో భాగంగా మరిన్ని నూతన రహదారులు.
* గోదావరి పుష్కరాల మాదిరిగానే కృష్ణా పుష్కరాలు.
* నది పొడవునా ఘాట్లు. పుణ్యక్షేత్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు.
* పనులన్నీ జులై నెలాఖరులోగా పూర్తి.
* ఇప్పటికే రాష్ట్రంలో 1.87 కోట్ల ఎల్ఈడీ బల్బుల పంపిణీ.
* 93.5 లక్షల ఇళ్లకు లబ్ధి.
* మార్చి 2016 నాటికి అన్ని ఇళ్లలోనూ ఎల్ఈడీ బల్బులుంటాయి.
* 3 లక్షల వీధి దీపాలను ఎల్ఈడీలతో మార్చాం.
* కాకినాడ - విశాఖ మధ్య గ్యాస్ పైప్ లైన్ జూన్ 2017లోగా పూర్తి.
* రాష్ట్రమంతటికీ గ్యాస్ గ్రిడ్ విస్తరణకు చర్యలు.
* ఈ ఏడాది లోగా అన్ని ఇళ్లలో గ్యాస్ స్టౌలే ఉంటాయి.
* ఈ-ఔషధి, తల్లీ బిడ్డా ఎక్స్ ప్రెస్ తదితరాలతో పేదలకు మేలు.
* నిర్మాణంలోని మంగళగిరి ఎయిమ్స్ కు మరిన్ని నిధులు.
* ప్రజలందరికీ పోషకాహారం ప్రభుత్వ లక్ష్యం.
* పోషకాహార లోపాలను తొలగించేందుకు మరిన్ని చర్యలు.
* అన్న అమృత హస్తంతో గర్భిణీలకు ఉచిత పోషకాహారం.
* అన్న అమృత హస్తానికి ఈ ఏడు 45 శాతం అధిక నిధులు.
* మధ్యాహ్న భోజన పథకానికి 67 శాతం అదనపు నిధులు.
* 4.01 కోట్ల మందికి చౌక ధరల దుకాణాల ద్వారా నిత్యావసరాల పంపిణీ.
* ప్రజల కొనుగోలు శక్తికి ఇబ్బందుల్లేకుండా ధరలు.
* నెలకు 50 యూనిట్ల కన్నా తక్కువ విద్యుత్ వాడే ఎస్సీల ఇళ్లకు మరిన్ని రాయితీలు.
* గత సంవత్సరంతో పోలిస్తే ఎస్టీలకు అదనంగా 75 శాతం నిధులు.
* బీసీలకు 31.5 శాతం అధిక నిధులు.
* 50 వేల బ్రాహ్మణ కుటుంబాలను దారిద్ర్య రేఖ ఎగువకు తెస్తాం.
* ఎన్టీఆర్ భరోసా పథకంతో పలు విభాగాల ప్రజలకు సాంఘిక భద్రత.
* 8.7 లక్షల స్వయం సహాయక బృందాల్లో 80 లక్షల మంది సభ్యులు.
* మహిళా సాధికారత సాధనకు మరిన్ని పథకాలు.
* స్వయం సహాయక బృంద సభ్యులకు డిజిటల్ విద్య.
* ప్రపంచ బ్యాంకు సాయంతో 150 వెనుకబడిన మండలాల్లో డిజిటల్ పాఠశాలలు.
* వీటిల్లో రైతులు, చిన్న చిన్న వ్యాపారస్తులకూ చోటు.
* యువతలో ఔత్సాహికత పెంపునకు ప్రత్యేక చర్యలు.
* నైపుణ్యాభివృద్ధే లక్ష్యంగా శిక్షణా కేంద్రాల ఏర్పాటు.
* 2019 నాటికి 2 కోట్ల మందికి శిక్షణ లక్ష్యం.
* రాష్ట్ర స్థాయిలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పెట్టిన తొలి రాష్ట్రం.
* పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతానికి చర్యలు.
* ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకూ పరీక్షా కాలమిది.
* ధైర్యంగా ముందడుగుతో సాగాల్సిన సమయం.
* ప్రజల అండదండలుంటేనే అభివృద్ధి.
* ఇండియాలోనే రాష్ట్రాన్ని నంబర్ వన్ గా నిలపడమే లక్ష్యం.