: ప్రణబ్ ముఖర్జీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు-2
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రసంగంలోని మరిన్ని ముఖ్యాంశాలు...
* నిరుద్యోగులను ఉద్యోగాలిచ్చే వారిగా మార్చడమే మేకిన్ ఇండియా లక్ష్యం.
* స్వచ్ఛ భారత్ ద్వారా ఆరోగ్య భారతావనిని రూపొందించే ప్రయత్నం.
* ఆసుపత్రుల్లో పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యం.
* యోగా, ఆయుర్వేదం, హోమియో, యునానీ వైద్య విధానాలకు పెద్దపీట.
* 118 నగరాల్లో నమామి గంగ.
* వెయ్యికి పైగా గ్రామాల్లో పరిశుభ్రతా కార్యక్రమాలు.
* అవినీతి నిర్మూలనకు దృఢ చిత్తంతో కృషి.
* అవినీతిపరుల భరతం పట్టేందుకు చట్టాల్లో మార్పులు.
* ఉజ్వల్ డిస్కల్ అస్యూరెన్స్ యోజన ద్వారా రాష్ట్రాలకు విద్యుత్ పంపిణి.
* జాతీయ ఖనిజ నిధి ద్వారా పారదర్శకంగా గనుల విధానం.
* రైల్వేస్టేషన్లు, రైళ్లలో పరిశుభ్రతకు ఎన్నో చర్యలు.
* జపాన్ ప్రభుత్వ సహకారంతో హై స్పీడ్ రైల్ ప్రాజెక్టు.
* డిజిటల్ ఇండియా ద్వారా గ్రామీణ ప్రాంతాలకు బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్.
* పర్యాటక రంగంలో స్వదేశ్ దర్శన్ ద్వారా 13 సర్క్యూట్ల గుర్తింపు.
* పారదర్శకంగా ప్రైవేట్ ఎఫ్ఎం రేడియో లైసెన్సులు.
* జీడీపీ వృద్ధికి మార్గం సుగమం చేసేలా మేకిన్ ఇండియా.
* విమానయాన రంగంలో కొత్త విధానాల అమలు.
* దేశంలోని చిన్న నగరాలకు విమాన సౌకర్యం.
* గణనీయంగా పెరిగిన ఎయిర్ లైన్స్ ఇండస్ట్రీ.
* నయీ మంజిల్ పథకం ద్వారా 20 వేల మదారసాలకు నిధులు.
* ముస్లిం విద్యార్థులకు నైపుణ్య శిక్షణ.
* సిల్క్ ఇండియా ద్వారా ఏడాదిలో 76 లక్షల మందికి శిక్షణ.