: రాజధాని ‘రియల్ బూం’పై చంద్రబాబు అసహనం... ధరలు తగ్గించకపోతే పరిశ్రమలు రావని కామెంట్

రాష్ట్ర విభజన తర్వాత ఏపీ తన నూతన రాజధానిని హైదరాబాదుకు దూరంగా నిర్మించుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామం ప్రభుత్వానికి గుదిబండగా మారగా, గుంటూరు జిల్లా తుళ్లూరు పరిసర ప్రాంతాలు, కృష్ణా జిల్లా విజయవాడ పరిసర వాసులకు అయాచిత వరంగా మారింది. ఈ క్రమంలో ఆ ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చేశాయి. అప్పటిదాకా ఎకరం రూ.10 లక్షలు కూడా పలకని ధర నవ్యాంధ్ర నూతన రాజధాని పుణ్యమా అని కోటి రూపాయలు దాటేసింది. ఈ క్రమంలో నేటి ఉదయం విజయవాడ పరిధిలోని తాడిగడపలో ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు... దిగిరాని రియల్ ధరలపై అసహనానికి గురయ్యారు. తక్షణమే ధరలు తగ్గని పక్షంలో ఇప్పటిదాకా నవ్యాంధ్రకు వస్తామని ప్రమాణం చేసిన కంపెనీలు కూడా ఇతర ప్రాంతాలకు తరలిపోవడం ఖాయమని ఆయన వాపోయారు.

More Telugu News