: ఖమ్మం జిల్లాలో సీఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ పర్యటన
తెలంగాణ సీఎం కార్యాలయ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. కొంతకాలంగా జరుగుతున్న మిషన్ భగీరథ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు వచ్చిన ఆమె ఇక్కడ వాజేడులో జరుగుతున్న పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై స్థానిక అధికారులతో ఆమె సమీక్ష చేశారు. తరువాత అక్కడి నుంచి పర్ణశాల, కొత్తగూడెం, వైరా, పాలేరు వెళ్లి పనులను పరిశీలించనున్నారు.