: రిజర్వేషన్లపై కాపు నేతలతో చంద్రబాబు కీలక సమావేశం

కాపులకు రిజర్వేషన్లు అంశంపై ఆ వర్గం నేతలతో కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు కీలక సమావేశం జరపనున్నారు. ఈ ఉదయం 11 గంటల తరువాత ప్రారంభమయ్యే ఈ సమావేశానికి కాపు సామాజిక వర్గ మంత్రులు చినరాజప్ప, గంటా శ్రీనివాస్ తదితరులతో పాటు పలువురు నేతలు హాజరు కానున్నారు. కాపులకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడివుందని, అయితే, ఈ మేరకు వివాదరహిత మార్గంలో వెళ్లాలన్నదే తన అభిమతమని ఇప్పటికే స్పష్టం చేసిన చంద్రబాబు, గతంలో విడుదలైన జీవో 30లోని అంశాలను గురించి కాపు నేతలకు వివరించనున్నారని సమాచారం. రిజర్వేషన్లు అత్యంత సున్నితమైన అంశమని, తొందరపడి నిర్ణయాలు కూడదని ఆయన నచ్చజెప్పనున్నట్టు తెలుస్తోంది.

More Telugu News