: పేదలకు మరింత దగ్గరగా ఖరీదైన వైద్యం: కామినేని

జనవరి 1 నుంచి పేదలకు మరిన్ని ఆరోగ్య వైద్య సేవలను దగ్గర చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. గుంటూరులో సెయింట్ జోసఫ్ హాస్పిటల్ లో ఎమర్జెన్సీ విభాగాన్ని ఆదివారం ఉదయం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, పేదలకు భారంగా మారుతున్న అధునాతన వైద్యాన్ని వారికి చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. కొత్తగా 5 రకాల వైద్య సేవలను అందించనున్నామని, అందులో భాగంగా, ఉచిత డయాగ్నసిస్, టెలీ రేడియాలజీ, సీటీ స్కాన్ సేవలు అందుతాయని వివరించారు. గర్భిణులు కాన్పు తరువాత, బిడ్డతో కలసి ఉచితంగా ఇంటికి చేరేలా కొత్త పథకాన్ని ప్రారంభించనున్నట్టు కామినేని పేర్కొన్నారు.

More Telugu News