: పోలీసులు స్పందించలేదని...మహిళ ఆత్మహత్య!

తన ఫిర్యాదుపై పోలీసులు స్పందించలేదని ఒక మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ లో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు... భూ వివాదం పరిష్కరించాలని కోరుతూ సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ లో ఒక మహిళ ఫిర్యాదు చేసింది. అయితే, పోలీసులు పట్టించుకోకపోవడంతో స్టేషన్ లోనే పురుగుల మందు తాగి సదరు మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

More Telugu News