: లోయలో పడ్డ పెళ్లి బస్సు... కడప జిల్లాలో ఘోర ప్రమాదం

కడప జిల్లాలో నేటి ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. పెళ్లి బృందంతో బయలుదేరిన ఓ బస్సు ఘాట్ రోడ్డులో అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వివరాల్లోకెళితే, పెద్దపసుపుల నుంచి పెళ్లి నిమిత్తం పులివెందులకు ఓ బృందం బస్సులో బయలుదేరింది. ముద్దనూరు ఘాట్ లో ప్రయాణిస్తున్న సమయంలో బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. అయితే అటుగా వెళుతున్న ప్రయాణికులు ప్రమాదాన్ని గమనించి తక్షణమే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని జమ్మలమడుగు ఆసుపత్రికి తరలించారు.

More Telugu News