: వీహెచ్ పీ నేత అశోక్ సింఘాల్ కన్నుమూత

విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్ పీ) అధినేత అశోక్ సింఘాల్ కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో, గుర్గావ్ లోని మేదాంత ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ నెల 14వ తేదీన న్యుమోనియా, గుండె, మూత్రపిండాల సమస్యలతో బాధపుడుతున్న సింఘాల్ ను మేదాంత ఆసుపత్రిలో చేర్చారు. అశోక్ సింఘాల్ మరణ వార్తను వీహెచ్ పీ అధినేత ప్రవీణ్ తొగాడియా నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన వయసు 89 సంవత్సరాలు.

More Telugu News