: ఫ్రాన్స్ పై ఉగ్రదాడి నేపథ్యంలో అమెరికా అప్రమత్తం

ప్యారిస్ లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో 150 మందికి పైగా మరణించారు. ఈ ఘటనతో ఫ్రాన్స్ మొత్తం వణుకుతుండగా, ప్రపంచ దేశాలన్నీ షాక్ కు గురయ్యాయి. ఈ నేపథ్యంలో, అగ్రరాజ్యం అమెరికా అలర్ట్ అయింది. దేశంలోని నగరాలు, ప్రధాన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. జనాలు ఎక్కువగా గుమికూడే ప్రాంతాలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్ల వద్ద నిఘా పెంచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ముందస్తు చర్యగా భద్రతను కట్టుదిట్టం చేశారు.

More Telugu News