: ఏపీలో రికార్డు ధరలు పలికిన వాహనాల ఫ్యాన్సీ నంబర్లు

ఆంధ్రప్రదేశ్ లో వాహనాల ఫ్యాన్సీ నంబర్లు రికార్డు ధరలు పలికాయి. దాంతో రవాణాశాఖకు బాగానే ఆదాయం వచ్చింది. ఫ్యాన్సీ నంబర్ ల సిరీస్ ప్రారంభం కావడంతో వాటికోసం వాహనదారులు పోటీ పడ్డారు. ఈ క్రమంలో ఫ్యాన్సీ నంబర్లకు ఉన్న డిమాండ్ ను బట్టి రవాణా అధికారులు షీల్డ్ వేలం నిర్వహించారు. ఈ వేలంలో ఏపీ 31డీఏ 9999 నంబరు అత్యధికంగా రూ.3.51 లక్షల ధర పలికింది. ఇక సింగిల్ నంబర్ 1కి రూ.1.10 లక్షలు, నంబర్ 7కు రూ.90,300 పలికాయి. నంబర్ 9కి రూ.1.17 లక్షల ధర పలికింది. ఈ నేపథ్యంలో ఫ్యాన్సీ నంబర్ల ద్వారా రూ.10.20 లక్షల ఆదాయం వచ్చినట్టు డీటీసీ వెంకటేశ్వరరావు వెల్లడించారు.

More Telugu News