: వర్ధమాన సినీ నటుడు బాల ప్రశాంత్ మృతి

'ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండీ బాబూ' సినిమాలో నటిస్తున్న వర్ధమాన సినీ నటుడు బాల ప్రశాంత్ మృతి చెందాడు. అనంతపురం జిల్లా గుంతకల్ కు చెందిన ప్రశాంత్ హైదరాబాదులోని మూసాపేటలో ఓ భవనంపై నుంచి కిందపడి మృతి చెందాడు. మూసాపేటలో ఓ వివాహితతో ప్రశాంత్ కు అక్రమ సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. ఇతను ఆమెతో కలసి వుండగా ఆమె బంధువులు రావడంతో, వారి నుంచి తప్పించుకునే క్రమంలోనే ఆయన భవనంపై నుంచి కిందపడి మృతి చెందినట్టు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News