: వివాదాస్పదమవుతున్న 'శ్రీమంతుడు' కథ

సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కిన 'శ్రీమంతుడు' సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈ సినిమా కథ వివాదాస్పదం అవుతోంది. ఈ కథ తనదే అంటూ సినీ రచయిత శరత్ చంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. నారా రోహిత్ హీరోగా సముద్ర దర్శకత్వంలో ఈ సినిమాను తీయడానికి జయలక్ష్మి ఫిలింస్ వారికి ఈ కథను ఇచ్చానని చెప్పారు. తన 'చచ్చేంత ప్రేమ' కథనే కొన్ని మార్పులు చేసి దర్శకుడు కొరటాల శివ 'శ్రీమంతుడు' సినిమా తీశారని తెలిపారు. శ్రీమంతుడు రిలీజ్ టైమ్ లో తాను కేరళలో ఉన్నానని... తన మిత్రులు చెప్పడంతో సినిమా చూశానని, ఆ తర్వాత సినీ రచయితల సంఘంలో ఫిర్యాదు చేశానని వెల్లడించారు. పరిశ్రమలోని కొంత మంది పెద్దలతో కూడా తన ఆవేదనను చెప్పుకున్నానని, అయినా తనకు న్యాయం జరగలేదని వాపోయారు. తనకు, జయలక్ష్మి ఫిలిమ్స్ అధినేత వెంకట్రావుకు న్యాయం చేయాలని శరత్ చంద్ర కోరారు.

More Telugu News