: వైఎస్ జగన్ ని ఆహ్వానించినా రానంటున్నాడు: సీఎం చంద్రబాబు

‘అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి మా ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించినా రానంటున్నాడు’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ, శంకుస్థాపన కార్యక్రమం చారిత్రక ఘట్టమని, ఈ మహోత్సవానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతినీ ఆహ్వానించామన్నారు. నవ్యాంధ్ర శంకుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆహ్వానించామని, ఆయనేదో ఇస్తారని తాము ఆశించడం లేదన్నారు. 'తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మా ఆత్మీయ అతిథి' అని, రెండు తెలుగు రాష్ట్రాలూ అన్నదమ్ముల్లాంటివని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

More Telugu News