: హరీష్ రావు సభలో మహిళ ఆత్మహత్యా యత్నం... కలకలం

తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు సభలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మార్కెట్ యార్డ్ లో జరిగిన సభలో ఈ సాయంత్రం హరీష్ రావు ప్రసంగిస్తుండగా... ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. తనతో పాటు తెచ్చుకున్న ఓ ద్రావకాన్ని తాగింది. అనంతరం, తన భూమిని స్థానిక జడ్పీటీసీ సభ్యుడు ఆక్రమించుకున్నాడని... పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆమె గట్టిగా అరుస్తూ చెప్పింది. దీంతో, సభలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఆత్మహత్యకు యత్నించిన మహిళను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు.

More Telugu News