: సూదిగాడి వల్ల ఎలాంటి హాని లేదు: ఏపీ డీజీపీ

ఇంజెక్షన్ సైకో గురించి మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నప్పటికీ... అతని వల్ల ఎలాంటి హాని లేదని ఏపీ డీజీపీ రాముడు అన్నారు. సైకో చేస్తున్న ఇంజెక్షన్లతో జనాలు భయభ్రాంతులకు గురవుతున్న సంగతి వాస్తవమే అయినప్పటికీ... ఆ దాడుల్లో ఎవరూ గాయపడలేదని, అస్వస్థతకు లోను కాలేదని చెప్పారు. మరోవైపు, రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ చాలా వరకు తగ్గిందని తెలిపారు. కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డిని విచారించిన అనంతరం... అతడిని సీఐడీకి అప్పగించే విషయంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

More Telugu News