: ఏపీలో వెంటనే 25 జిల్లాలు ఏర్పాటు చేయాలి: హరిబాబు

లోక్ సభ నియోజకవర్గాల కేంద్రంగా ఏపీలో 25 జిల్లాలను వెంటనే ఏర్పాటు చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు డిమాండ్ చేశారు. పట్టిసీమను పూర్తి చేస్తున్న తరహాలోనే పోలవరం నిర్మాణాన్ని కూడా త్వరగా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బీజేపీ ప్రతినిధుల బృందం ఈ నెల 12న పోలవరం, 13న తోటపల్లి ప్రాజెక్టు, 14, 15 తేదీల్లో రాయలసీమలోని ప్రాజెక్టులను పరిశీలిస్తున్నారని తెలిపారు.

More Telugu News