: కాశ్మీర్ లో కుప్పకూలిన వైమానికదళ విమానం

భారత వైమానిక దళానికి చెందిన మరో మిగ్-21 విమానం కూలిపోయింది. జమ్ము కాశ్మీర్ లోని బద్గాం జిల్లాలో ఉన్న సోయ్ బగ్ ప్రాంతంలో ఈ ఉదయం 11 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వైమానిక కేంద్రం నుంచి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే విమానం కుప్పకూలి బూడిదైంది. అయితే, పైలట్ మాత్రం ప్యారాచూట్ సహాయంతో సురక్షితంగా బయటపడినట్టు రక్షణశాఖ అధికారి తెలిపారు. గత కొన్నేళ్లుగా పలు మిగ్ విమానాలు కూలిపోవడం గమనార్హం.

More Telugu News