: సీబీఐ బోనులో ‘గాలి’ సోదరులు... ఐఏఎస్ శ్రీలక్ష్మి కూడా!

ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసు విచారణకు సంబంధించి కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. కేసు విచారణ నిమిత్తం ఆయన తన సోదరుడు శ్రీనివాసరెడ్డితో కలిసి కోర్టుకు వచ్చారు. ఇక ఈ కేసులో నిందితురాలిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి కూడా కోర్టు విచారణకు హాజరయ్యారు. నిందితులను విచారించిన న్యాయమూర్తి కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 18కి వాయిదా వేశారు.

More Telugu News