: రఘువీరా అసమర్థత వల్లే తిరుపతి ఘటన జరిగింది: సోమిరెడ్డి

తిరుపతిలో ఈరోజు ఓ కాంగ్రెస్ కార్యకర్త ఒంటికి నిప్పంటించుకుని ఆత్మాహుతికి యత్నించడంపై టీడీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అసమర్థత వల్లే ఈ ఘటన జరిగిందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఘటనకు రఘువీరాదే భాధ్యత అని స్పష్టం చేశారు. ఆయన తన పదవికి రాజీనామా చేయాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ పరిస్థితికి కాంగ్రెస్ పార్టీనే కారణమని మండిపడ్డారు. అటు, గాలి ముద్దుకృష్ణమనాయుడు కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. తిరుపతి ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎంతో ఆవేదనతో ఉన్నారని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం ఆయన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.

More Telugu News