: వసీం అక్రమ్ కారుపై కాల్పుల కేసులో ఒకరి అరెస్ట్

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ కారుపై కరాచీలో జరిగిన కాల్పుల కేసులో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతను ఓ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు అని, అతని యజమాని కోసం పోలీసులు వెతుకులాట మొదలుపెట్టినట్టు పాక్ ఛానల్ జియో టీవీ పేర్కొంది. అక్రమ్ కారుపై కాల్పులు జరిగిన సమయంలో ఆ యజమాని కూడా అక్కడ ఉన్నాడని పోలీసులు చెప్పారు. ఇటీవల తన ఇంటి నుంచి నేషనల్ స్టేడియంకు అక్రమ్ కారులో వెళుతున్న సమయంలో షా ఫైసల్ రోడ్డులో అనూహ్యంగా కాల్పులు జరిగాయి. అయితే ఎలాంటి ప్రమాదం జరగకుండా అక్రమ్ బయటపడ్డారు.

More Telugu News