: తెలుగు రాష్ట్రాల్లో సమస్యల్లేవు... మీడియానే వాటిని సృష్టిస్తోంది: గవర్నర్

ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోయల్ తో సమావేశం అనంతరం గవర్నర్ నరసింహన్ మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు. అయితే మీడియానే ఆ రాష్ట్రాల్లో సమస్యలు సృష్టిస్తోందని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా త్వరలోనే విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. మరికాసేపట్లో గవర్నర్ హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సమావేశమై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరిస్థితులపై వివరించనున్నారు.

More Telugu News