: కృష్ణా జిల్లాలో జగన్...విష జ్వరాలతో చనిపోయిన వారి కుటుంబాలకు పరామర్శ

వైకాపా అధినేత జగన్ నేడు కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని చల్లపల్లి మండలం కొత్త మాజేరులో విష జ్వరాలతో చనిపోయిన వారి కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. ఈ క్రమంలో, ఈ ఉదయం హైదరాబాదు నుంచి బయల్దేరి 8.30 గంటలకు ఆయన గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో కొత్త మాజేరుకు బయల్దేరారు. పరామర్శల అనంతరం సాయంత్రం ఐదు గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుని, అక్కడ నుంచి హైదరాబాద్ బయల్దేరుతారు.

More Telugu News