: జీహెచ్ఎంసీ ఎన్నికలకు కమిటీ ఏర్పాటు చేసిన వైసీపీ

గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థకు త్వరలో జరగబోయే ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటినుంచే సమాయత్తమవుతోంది. ఈ మేరకు పార్టీ ఎన్నికల కమిటీని ప్రకటించింది. కమిటీ సభ్యులుగా శివకుమార్, గట్టు శ్రీకాంత్ రెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, కొండా రాఘవరెడ్డి, రెహమాన్, ఆదం విజయ్ కుమార్ తదితరులు ఈ కమిటీలో వున్నారు. మరోవైపు గ్రేటర్ ఎన్నిలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు వైసీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు.

More Telugu News