: ఎల్లుండి ఉదయం 10.30 గంటలకు కలాం అంత్యక్రియలు

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంత్యక్రియలు ఎల్లుండి (గురువారం) జరగనున్నాయి. ఈ మేరకు రేపు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి తమిళనాడులోని రామేశ్వరానికి ఆయన పార్థివదేహాన్ని తరలిస్తారు. అక్కడ ప్రజల సందర్శనార్థం సాయంత్రం 7 గంటల వరకు ఉంచనున్నారు. తరువాత గురువారం ఉదయం 10.30 గంటలకు కలాం అంత్యక్రియలు నిర్వహించనున్నారని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సమాచారం. అంత్యక్రియల కోసం ఇప్పటికే రామేశ్వరంలో ఏర్పాట్లు మొదలయ్యాయి. అంతకుముందు కలాం అంత్యక్రియలు రేపే నిర్వహిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

More Telugu News