: బీచ్ లు, స్విమ్మింగ్ పూల్ లకు పరుగులు తీస్తున్న జపాన్, తైవాన్ ప్రజలు

భారత్ లో కొన్ని సమయాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ కు పైనే నమోదవుతుంటాయి. భానుడి ఉగ్రరూపం కారణంగా అలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఆ సమయాల్లో ప్రజల ఇక్కట్లు చెప్పనలవి కాదు. అమితమైన వేడి నుంచి రక్షణ కోసం నానాపాట్లు పడతారు. అదే, జపాన్, తైవాన్ వంటి దేశాల విషయానికొస్తే అక్కడి ప్రజలు 36 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను కూడా తట్టుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఆ దేశాల్లో ప్రజలు ఎండవేడిమి భరించలేక స్విమ్మింగ్ పూల్ లు, సముద్ర తీరాలను ఆశ్రయిస్తున్నారట. ఆదివారం భానుడి తీవ్రతకు జడిసి ప్రజలు ఇళ్లను వీడి ఉపశమనం కోసం నీళ్ల బాట పట్టారు. జలకాలాటలతో సేదదీరుతూ ఎండ నుంచి రక్షణ పొందే ప్రయత్నం చేస్తున్నారు.

More Telugu News