: ఆధార్ తో ఓటర్ కార్డు అనుసంధానం తప్పనిసరి: సీఎం కేసీఆర్

ఓటర్లందరూ ఆధార్ తో ఓటర్ కార్డు అనుసంధానం తప్పనిసరిగా చేసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. లేకపోతే ఓటుహక్కు ఉండదని స్పష్టం చేశారు. హైదరాబాద్ లో బోగస్ ఓట్లు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మొదటగా హైదరాబాద్ లో ఓటరు కార్డులకు ఆధార్ అనుసంధానం చేస్తామన్నారు. తరువాత రాష్ట్రవ్యాప్తంగా ఆధార్ అనుసంధానం జరుగుతుందని చెప్పారు. ఎన్నికల కమిషనర్ భన్వర్ లాల్ ఈరోజు కేసీఆర్ ను క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ఓటర్ గుర్తింపు కార్డులకు ఆధార్ అనుసంధానంపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన కంటే ముందే ఓటర్ల జాబితా సిద్ధం చేస్తామన్నారు. నగరంలో 15 లక్షల మంది బోగస్ ఓటర్లు ఉన్నట్టు తెలుస్తోందని పేర్కొన్నారు. అలాంటి కార్డుల ఏరివేతకు చర్యలు తీసుకుంటామన్నారు.

More Telugu News