: రాష్ట్రపతి గౌరవార్థం రేపు గవర్నర్ విందు... చంద్రబాబు, కేసీఆర్ లకు ఆహ్వానం

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం గవర్నర్ నరసింహన్ రాజభవన్ లో రేపు సాయంత్రం 7 గంటలకు విందు ఇవ్వబోతున్నారు. దానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ లు సతీసమేతంగా హాజరుకావాలంటూ గవర్నర్ ఆహ్వానించారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులను కూడా ఈ విందుకు ఆహ్వానించారు. పది రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ఈ రోజు హైదరాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే. ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య విభేదాలు మరింత పెరిగాయి. అయితే రేపటి గవర్నర్ విందుకు వారిద్దరూ హాజరై మాట్లాడుకుంటారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

More Telugu News