: తొలిసారి ఎంపీ అయిన వ్యక్తికి 'సన్సద్ రత్న 2015 అవార్డ్'

రాజస్థాన్ కు చెందిన భారతీయ జనతా పార్టీ నేత, తొలిసారి లోక్ సభ సభ్యుడైన పీపీ చౌదరి 'సన్సద్ రత్న 2015 అవార్డు'కు ఎంపికయ్యారు. ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల్లో ఆయన పనితీరుకు గానూ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. "ఈ అవార్డుకు ఎంపికైన నలుగురు లోక్ సభ సభ్యుల్లో చౌదరి ఒకరు. 16వ లోక్ సభ బడ్జెట్ సమావేశాల్లో విశిష్ట ప్రదర్శనకుగానూ వారిని ఎంపిక చేశాము" అని ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ చైర్మన్ కె.శ్రీనివాసన్ తెలిపారు.

More Telugu News