: నాడు చంద్రబాబు అమలు చేసిందే నేడు మోదీ అమలు చేస్తున్నారు: అశోక్ గజపతిరాజు

కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు తిరుపతిలో 'జన్ కల్యాణ్ పర్వ్' సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అప్పట్లో చంద్రబాబునాయుడు 'క్లీన్ అండ్ గ్రీన్' పేరిట పథకం అమలు చేశారని, ఇప్పుడు ప్రధాని మోదీ కూడా ఆ పథకాన్నే 'స్వచ్ఛ భారత్' పేరిట అమలు చేస్తున్నారని తెలిపారు. ఇక, జూన్, జూలై లోపే తిరుపతి విమానాశ్రయం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుగా రూపుదిద్దుకుంటుందని అన్నారు. మోదీ నాయకత్వంలోని కేంద్రం నుంచి రాష్ట్రానికి మరిన్ని నిధులు వస్తాయని ఆయన తెలిపారు.

More Telugu News