: ప్రత్యేక హోదాను సాధించే విషయంలో తనకు నమ్మకముందన్న బాలకృష్ణ!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించే విషయంలో ప్రధాని నరేంద్ర మోదీపై తనకు నమ్మకముందని, త్వరలోనే హోదాపై ప్రకటన వస్తుందని భావిస్తున్నానని హిందుపురం ఎమ్మెల్యే, సినీ హీరో బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా కోసం రాజీలేని పోరాటం చేస్తామని ఆయన అన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటికే ప్రధానమంత్రితో మాట్లాడారని చెప్పారు. తనపై, తన కుటుంబంపై అభిమానం చూపుతున్న అనంతపురం జిల్లా వాసులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ధర్మవరంలో చేనేత కార్మిక కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.