: నాందేడ్ చేరుకున్న రాహుల్... కాసేపట్లో నిర్మల్ పయనం

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు బయల్దేరారు. ఈ సాయంత్రం మహారాష్ట్రలోని నాందేడ్ కు విమానంలో చేరుకున్న ఆయన, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పయనమవుతారు. ఈ రాత్రికి నిర్మల్ లో బస చేస్తారు. ఆయన తెలంగాణలో ప్రవేశించేందుకు రోడ్డు మార్గాన్ని ఎంచుకోవడంతో, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కాగా, నాందేడ్ లో ఆయనకు కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రంలో ఆయన పాదయాత్ర నిర్వహించనున్నారు.

More Telugu News