: పాక్ ఘటనపై మోదీ విచారం
పాక్ ఆర్థిక రాజధాని కరాచీలో ఓ బస్సుపై దాడి చేసిన ఉగ్రవాదులు 47 మందిని పొట్టన బెట్టుకున్నారు. ఈ దారుణ ఘటనతో పాకిస్థాన్ ప్రజలు మరోసారి ఉలిక్కిపడ్డారు. భయాందోళనలకు గురవుతున్నారు. ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన మోదీ... దాడిలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఆపద సమయంలో పాక్ కు అండగా నిలుస్తామని ట్విట్టర్లో తెలిపారు.