: విభజన తరువాత ఆగిన ప్రయాణాలు... రైల్వే శాఖ వెల్లడించిన ఆసక్తికర నిజం
ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లకు ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయిందట. అది కూడా వేలల్లో కాదు. లక్షల సంఖ్యలో ప్రయాణికులు తగ్గారట. ఈ ఆసక్తికర నిజాన్ని రైల్వే శాఖ వెల్లడించింది. రాష్ట్ర విభజన అనంతరం, జూన్ 2014 నుంచి అక్టోబర్ 2014 మధ్య 60 లక్షల మంది ప్రయాణికులు తగ్గారని తెలిపింది. తెలంగాణ ఉద్యమ సమయంలో బస్సుల బంద్ కారణంగా, 70 లక్షల మంది ప్రయాణికులు రైళ్లల్లో తమ గమ్యాలు చేరుకోగా, తెలంగాణ ఏర్పడిన తరువాత వీరంతా తిరిగి రోడ్డు రవాణానే ఎంచుకున్నారట. రైల్వే శాఖకు సంబంధించిన స్థాయీ సంఘం లోక్సభకు సమర్పించిన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది.