: రాహుల్ పర్యటనలో రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలి: వీహెచ్

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మే రెండవ వారంలో రైతు భరోసా యాత్ర చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆత్మహత్య చేసుకున్న ఒక్కో రైతు కుటుంబానికి పీసీసీ లక్ష రూపాయల ఆర్థిక సాయం చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ఆయన, తనవంతుగా లక్ష రూపాయలు ఇస్తున్నట్లు చెప్పారు. తనలానే మిగతా నేతలు కూడా లక్ష విరాళం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 500 మంది కార్యకర్తలు రాహుల్ వెంట తరలిరావాలని వీహెచ్ కోరారు.

More Telugu News