: ఈ నెల 12 నుంచి చంద్రబాబు చైనా పర్యటన

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 12 నుంచి చైనాలో పర్యటించనున్నారు. ఈ అర్ధరాత్రి (అంటే తెల్లవారితే ఆదివారం) సీఎం హైదరాబాదు నుంచి బీజింగ్ బయలుదేరతారు. ఈ నెల 17 వరకు పర్యటన కొనసాగుతుంది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంగా బాబు పర్యటన జరగనుంది. ఈ నేపథ్యంలో బీజింగ్, చెంగ్డూ, షాంగైల్లో దిగ్గజ పారిశ్రామికవేత్తలతో సమావేశం అవడంతో బాటు, పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటనలో చంద్రబాబు వెంట మంత్రులు యనమల రామకృష్ణుడు, పి.నారాయణ, కె.అచ్చెన్నాయుడు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు, రాష్ట్ర సలహాదారు పరకాల ప్రభాకర్, సీఎం ముఖ్యకార్యదర్శి సతీష్ చంద్ర, పలువురు ప్రభుత్వ అధికారులు బృందంగా వెళ్లనున్నారు.

More Telugu News