: మధ్యప్రదేశ్ గవర్నర్ కు గుండెపోటు

మధ్యప్రదేశ్ గవర్నర్‌ రామ్‌ నరేష్‌ యాదవ్‌ కు ఈ మధ్యాహ్నం గుండెపోటు వచ్చింది. హుటాహుటిన ఆయనను భోపాల్‌ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స చేస్తున్నట్టు వైద్యులు తెలిపారు. ఆయన కుమారుడు శైలేష్‌ యాదవ్‌ ఈ ఉదయం తన సొంత ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. ఉద్యోగ నియామకాల స్కాంలో ఆయనను నిందితుడిగా పేర్కొంటూ, పోలీసులు ఛార్జ్‌ షీట్‌ కూడా దాఖలు చేశారు. కాగా, కొడుకు మరణాన్ని రామ్ నరేష్ తట్టుకోలేకపోయారని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

More Telugu News