: ఎన్నికలెప్పుడొచ్చినా సిద్ధం... నాపై ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిందే: తలసాని

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాను సిద్ధంగానే ఉన్నానని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ స్పష్టం చేశారు. గడచిన ఎన్నికల్లో టీడీపీ తరఫున సనత్ నగర్ నుంచి బరిలోకి దిగి విజయం సాధించిన ఆయన ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి చేపట్టారు. దీంతో హతాశులైన టీ టీడీపీ నేతలు, తలసానిని అనర్హుడిగా ప్రకటించాలని ఎప్పడికప్పుడు విరుచుకుపడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం దీనిపై తలసాని ఘాటుగా స్పందించారు. సనత్ నగర్ అసెంబ్లీకి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాను సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు. తనపై పోటీ చేసి ఓడిన వ్యక్తి మాత్రం రాజకీయ సన్యాసం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

More Telugu News