: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ముఖ్యాంశాలు... పార్ట్-1
2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఈ మధ్యాహ్నం 12:15 గంటల సమయంలో అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అందులోని ప్రధానాంశాలు...
* అంబేద్కర్ ను ఉటంకిస్తూ మొదలైన యనమల ప్రసంగం
* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ రూ. 1,13,048 కోట్లు
* ప్రణాళికేతర వ్యయం రూ. 78,626 కోట్లు
* ప్రణాళికా వ్యయం రూ. 34,412 కోట్లు
* రెవెన్యూ లోటు రూ. 7,300 కోట్లు
* ఆర్థిక లోటు రూ. 17,584 కోట్లు
* మూలధన బడ్జెట్ రూ. 9,818 కోట్లు
* సమానత్వాన్ని, సమగ్రతనూ సాధించే బడ్జెట్ ఇది
* విభజన ముందు పాలన పడకేసింది
* విభజన తీరుతో సంక్లిష్టంగా మారిన పరిస్థితి
* ఎన్నో అవకాశాలు కోల్పోయాం
* ప్రస్తుత వనరులు రాష్ట్ర అభివృద్ధికి సరిపోవు
* అభివృద్ధిలో 2001లో 10వ స్థానం నుంచి 2008లో 15వ స్థానానికి దిగజారాము
* రెవెన్యు లోటు కొనసాగుతోంది
* భవిష్యత్తులో పెరుగుతుంది
* ప్రకృతి సైతం హుద్ హుద్ రూపంలో విరుచుకుపడింది
* ఇది జీరో బేస్డ్ బడ్జెట్
* ప్రజలపై అదనపు భారం మోపబోము
* విభజన హామీల అమలుకు కృషి
* తాగునీటికి రూ. 5,258 కోట్లు
* సాంఘిక సంక్షేమానికి రూ. 2,123 కోట్లు
* గిరిజన సంక్షేమానికి రూ. 993 కోట్లు
* వెనుకబడిన తరగతులకు రూ. 3,231 కోట్లు
* పోలీసు సంక్షేమానికి రూ. 40 కోట్లు
* రవాణా రంగానికి రూ. 122 కోట్లు
* విపత్తుల నివారణకు రూ. 488 కోట్లు
* అటవీ శాఖకు రూ. 284 కోట్లు