: రాష్ట్రపతితో సమావేశమైన జైట్లీ

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశమయ్యారు. సాధారణ బడ్జెట్ ను ఈ రోజు పార్లమెంటులో ప్రవేశపెడుతున్న నేపథ్యంలో, రాష్ట్రపతి భవన్ వెళ్లి ప్రణబ్ దాదాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా, బడ్జెట్ వివరాలను రాష్ట్రపతికి జైట్లీ వివరించారు. సాధారణంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతిని ఆర్థికమంత్రి కలవడం ఆనవాయతీగా వస్తోంది. రాష్ట్రపతితో భేటీ అనంతరం పార్లమెంటుకు జైట్లీ బయలుదేరారు. మరో అరగంటలో పార్లమెంటులో జైట్లీ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

More Telugu News