: రైల్వేబడ్జెట్ ప్రధాన అంశాలు-2
కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు కొద్దిసేపటి క్రితం పార్లమెంట్ లో రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ పై లోక్ సభలో మంత్రి ప్రసంగం కొనసాగుతోంది. అందులోని ముఖ్యాంశాలు...
- రైళ్లలోని సాధారణ బోగీల్లోనూ మొబైల్ ఛార్జింగ్ సదుపాయం
- రైళ్ల రాకపోకలపై ఎస్ఎంఎస్ సమాచారం
- ఏ1, ఏ2 బోగీల్లో వై-ఫై సౌకర్యం
- మహిళల బోగీల్లో సీసీ కెమెరాల ఏర్పాటు
- వృద్ధులు, వికలాంగులకు ఆధునిక సౌకర్యాలు
- ఆన్ లైన్ లో వీల్ చైర్ రిజర్వ్ చేసుకునే వెసులుబాటు
- పెట్టుబడుల కోసం బ్యాంకులు, పెన్షన్ ఫండ్ల వినియోగం
- బీ స్టేషన్లలోనూ వై-ఫై సౌకర్యం
- రైల్వే స్టేషన్లలో లిఫ్ట్, ఎస్కలేటర్ల ఏర్పాటు కోసం రూ.120 కోట్లు
- 4 నెలల ముందు నుంచే టికెట్లు బుక్ చేసుకునే అవకాశం
- రద్దీగా ఉండే రూట్లలో తిరిగే రైళ్లలో జనరల్ బోగీల పెంపు
- 108 రైళ్లలో ఈ-క్యాటరింగ్ వ్యవస్థ
- తక్కువ ధరకే తాగునీరు
- కొత్త రైల్వే లైన్ల కోసం రూ.8,600 కోట్లు
- దేశవ్యాప్తంగా 24 గంటలు అందుబాటులో ఉండే హెల్ప్ లైన్ నెంబరు: 138