: 43 శాతం ఫిట్ మెంట్ కు అంగీకరించిన ఏపీ

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చేందుకు అంగీకరించింది. 2014, జూన్ 2 నుంచి నూతన పీఆర్సీ అమలు చేయనున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆర్థిక సమస్యలున్నప్పటికీ ఉద్యోగుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. ఏపీ ఆదాయాన్ని పెంచుకోవాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆదాయం పెరిగేంతవరకు సహాయం చేయాలని కేంద్రాన్ని కోరినట్టు ఆయన వెల్లడించారు. కాగా, ప్రభుత్వం ఫిట్ మెంట్ పెంచడంపై ఏపీ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

More Telugu News